నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Showing posts with label కావ్యాలంకారచూడామణి( ఛందః ప్రకరణము ). Show all posts
Showing posts with label కావ్యాలంకారచూడామణి( ఛందః ప్రకరణము ). Show all posts

Jul 8, 2010

ప్ర ప రాప స మను సు ప్ర త్యపి ని ర్దు రధి న్యు పా భ్యు దాజ్వ్య త్యవ ప

ప్రాది వళి నిరూపణము
క.
ప్ర ప రాప స మను సు ప్ర
త్యపి ని ర్దు రధి న్యు పా భ్యు దాజ్వ్య త్యవ ప
ర్యుపసర్గ వింశతికి వళు
లు పరస్పరవర్ణయుక్తి నుభయముఁ జెల్లున్.
47

1.ప్ర - 2.పరా - 3.అప - 4.సమ్ - 5.అను - 6.సు - 7.ప్రతి - 8.అపి - 9.నిర్ - 10.దుర్ - 11.అధి - 12.ని - 13.ఉప - 14.అభి - 15.ఉత్ - 16.ఆజ్ - 17.వి - 18.అతి - 19.అవ - 20. పరి : ఇవి యిరువదియు నుపసర్గలు; ఇందు అప్యాజ్ అను నిరూపణ మప్రసిద్ధము. వీనిలో పరా, ఆజ్, అపి అన్నవి కాక మిగిలిన పదునేడును బరస్పర సంధి యైనప్పుడు స్వరయతి యైనను, వ్యంజనయతి యైనను బ్రయోగింప వచ్చును(ఛందోదర్పణము).

వీటి కన్నింటికీ ఉదాహరణలు క్రింది పద్యాలలో ఉన్నాయి.

శా.
ప్రారంభించు నశేషధర్మముల, సంపాదించు సత్కీర్తులన్            (ప్ర+ఆరంభించు  - పా)
బ్రారబ్ధంబులు నిర్వహించు ఫలర్యంతంబుగా నెప్పుడున్,           (ప్ర+రబ్ధంబులు - పరి+అంతము)
బ్రారబ్ధ ప్రతిలబ్ధ సంపదలచే రాగిల్లు నుల్లాసి యై,                      (ప్ర+ఆరబ్ధ - )
యీ రా జంచు నుతింతు రార్యు లిల విశ్వేశావనీవల్లభున్. 48       ( య+ - విశ్వ+శ )
తే. 
రిపుల విశసించు చోటఁ బరేతనాథుఁ,                                    ( ర+ - పర+తనాథు )
డుర్వి రక్షించుచోటఁ బరోభుజుఁడు                                    ( డ+ - పర+ఢ )
హుధనా వాప్తిచో ననపాయబుద్ధి,                                     ( - నను+అ+ఆయ )
యంతరరులకు నీ రా జపాయకరుఁడు. 49                             ( య్ +అంత - రాజు+అప+యకరుడు )


స్మయరహితంబు, వై భవమా గమ, మాహవధుర్యశౌర్య మ          ( స్మ - సమ్+ గమ )
వ్యయము, జయంబు విస్మయగ్రము, పాదవినమ్ర శాత్రవా         (  వ్య - సమ్+ గ్రము )
న్వయ పరిరక్షణం బభినవంబు, నయోచిత శాస్త్రవాచకా                 (శాత్రవాన్+య - వం )
న్వయనిపుణంబు చిత్త , మనయంబును విశ్వనరేంద్రభర్తకున్.         ( వాచకాన్+వయ -యంబు )
సీ.
సభావశీలి నిరంతరశ్రుతి శాలి I ర్థావబోధ నిర్గళుండు,
రాజన్యజన్య దురంత విక్రముఁడు దు, I వగాహవిద్యా విహారభూమి,
దానార్హ సంపదధ్యావాస మాయుధా I త వేదసశ్వదధ్యయనవేది
న్యాయ త ర్కాది నానాశాస్త్రకుతుకి వి I న్యస్తపూతార్థ మహాశయుండు. 42
ఆ.
ప్రచుర ఫలిత చతురుపాయాభిరాముఁ డు
పేంద్రభూపతనయుఁ డింద్రనిభుఁడు
భీమబలుఁడు జగదభీహిత శోభనా
భ్యర్థి విశ్వనాథుఁ వనివిభుఁడు. 43
క.
చంచలత లేక దానో I దంచితుఁ డగువిశ్వనాథ రణీశ్వరుచే
మించినసుకవీశ్వరుల దృ I గంచలముల మలయు సిరు లుదగ్రప్రీతిన్. 44
చ.
వ్యపగత దోషుఁ డవ్యసనర్గుఁ డుదంచిత మంత్రపంచక
వ్యపగతశత్రుమండలుఁ డయాన్వితుఁ డూర్జిత వైరిభూవర
ద్విపవరమత్త కేసరి యతీంద్రియఖేలనుఁ డార్య చర్యుఁ డ
త్యుపచితశౌర్యశాలి సుగుణోన్నతి విశ్వనరేంద్రుఁ డెప్పుడున్. 45
తే.
విశ్వ విశ్వంభరాసమా వేక్షణమున
డరు నీహిత బహుఫలావాప్తు లెల్లఁ ;
బ్రణతు లొనరింతు రఖిల పర్యంతనృపులు
ర్థి విశ్వేశ్వరునకుఁ బర్యాయగతుల. 46
పైన కొన్నింటిని విడదీసి వళులు గుర్తించే ప్రయత్నం చేసాను. కాని నా మట్టుకు నాకే నేను గుర్తించినవి సరియైనవా కావా అనే అనుమానం రావటం మొదలెట్టింది. అందుచేతనే పూర్తి చెయ్యకుండా విడిచిపెట్టాను.

0 comments

Jul 2, 2010

మ ర వ ల ఱ లేకతరవళు లరయగఁ దమతమక కవులయనుమతి వళులై

ఏకతర వళి నిరూపణము
క.
మ ర వ ల ఱ లేకతరవళు
లరయగఁ దమతమక కవులయనుమతి వళులై
బరఁగుఁ, బదాంతముకారము
పొరిఁబొందిన పు ఫు బు భు ము లు పొసఁగిన చోటన్
. 43
మ, ర, వ, ల, ఱ - ఇవి ఏకతరవళులు - పూర్వ కవుల అనుమతితో ఇవి ఒకటొకటే ( తమకు తామే )యతి సాజాత్యాన్ని కలిగి ఉంటాయి . వీటికి ఉదాహరణలు చూడండి.
ఆ.
ధురవచనుఁ డార్యమాననీయాగ్రణి I సికవరుఁడు రాజరాజనిభుఁడు
రుస యెఱిఁగి సుకవిరులకు నిచ్చిన I చ్చి విశ్వవిభునిలాగు మెచ్చు. 44
ఆ.
జ్జు లాని యీగి ఱావడి సభలోన I ఱేసి పోరి లోన ఱిచ్చఁ బొఱసి
ఱెన్న మడుగుపుడమిఱేండ్ర నేలనుతింప I నకు విశ్వనాథుఁ డొనరియుండ. 45

ముకారవళినిరూపణము
తే.
పుడమి విశ్వవిభునిభుమునకుఁ దొడవు I ఫుల్లపద్మాలయ వితీర్ణమునకు బోటి
బుధులు విద్యావివేచనమునకు సాక్షి I భువనములు కీ ర్తి కి నివాసములు దలంప. 46

పు ఫు బు భు లు పదము చివరిలోగల ము కారముతో యతి సాజాత్యం కలిగి ఉంటాయి.

0 comments

Jul 1, 2010

కా కై కౌ లట కత్వము కీ కేలు కృ కూృలు నట్లె , కిత్వము వళులై

కాది వర్గమునకు గుణితస్వరవళి నిరూపణము
క.
కా కై కౌ లట కత్వము
కీ కేలు కృ కూృలు నట్లె , కిత్వము వళులై
కూ కోలు కుత్వమునకును
జేకొను దత్కాదిళాంత సిద్ధార్ణతతిన్.
38

క గుణితం లోని అక్షరాలు వేటి కేవి యతులుగా ఉంటాయో చెప్తున్నాడు. క కి కా, కై, కౌలు యతులు. అలాగే కి కి కే, కృ కూృలు యతులు. కు కి కూ కోలు వళులౌతాయి.

ఇతరేతర వర్గజ వళి నిరూపణము
క.
ఇత రేత రవర్గజ వళి
తతికిఁ జవర్గువును శ ష స దగు నొక గమియై;
కృతులకు న హ య లు నేక
స్థితి నొకవంగళము; నణలుఁ జెలఁగు నొకటియై. 39
ఇతరేతర వర్గజ వళిలో చ వర్గము, శ ష స లు ఒక గుంపుగానూ, అ, హ, య లు మూడూ ఒక గుంపుగానూ, మరియు న, ణ ల రెండూను  ఒకదాని కొకటి యతిసాజాత్యాన్ని కలిగి ఉంటాయి.; వీటికి ఉదాహరణలను క్రింద ఇస్తున్నాడు చూడండి.
చ.
తుర చళుక్యవిశ్వవిభుశాసన మెక్కినరాజమౌళు ల
చ్చత మకుటోజ్జ్వలస్రగనుక్తము లై విలసిల్లు నెందు; నీ
తనము నీతిమంతులకు సాఁగిన నేమి కొఱంత ? సంతతో
జ్ఝితమదబుద్ధులుం గుశలసిద్ధులు పొందుట లెల్లఁ బోలవే. 40

ఆ.
తురుపాయబాహుక్తిక్షమావళి I బాఱ విడిచి చిత్రభానుసాక్షిఁ
బాఱె సర్వసిద్ధిద మేది ధరణీవ I రాహమునకు నోడి రాచకదుపు. 41
చ.
మమత కాస్పదంబు, వినయంబునకుం గుదు, రుబ్బులేనినె
య్యమునకు నాలవాలము, మహాగుణపంక్తికి జన్మభూమి, దా
మునకు నాదరం, బరిరక్రియ కుగ్రనికేతనంబు నా
మరుఁ జళుక్యవిశ్వమనుజాధిపుచిత్తమమత్తవృత్తియై. 42

0 comments

Jun 30, 2010

తుది నున్న ఙ ఞ ణ న మ లు వదలిన యా క చ ట త ప ల వర్గాక్షరముల్

వర్గవళి నిరూపణము

క.
తుది నున్న ఙ ఞ ణ న మ లు
వదలిన యా క చ ట త ప ల వర్గాక్షరముల్
వొదిఁ దనవంగడములలో
నదికిన నవ్వళులు వర్గజాఖ్యము లరయన్
. 36

వర్గాక్షరాలలో ప్రతి వర్గానికీ చివరను గల అనునాసికాక్షరములను విడిచి పెట్టి మిగిలిన వర్గాక్షరాలు తమ తమ వర్గంలోని ఇతర అక్షరాలతో అతికినప్పుడు ఆ యతులను వర్గజ యతులు అంటారు. అంటే క, ఖ ,గ, ఘ లు ; చ, ఛ, జ ఝ లు ; ట, ఠ, డ, ఢ లు ; ప. ఫ, బ, భ, లు -- ఇవి ఏ వర్గంలోని అక్షరాలు ఆ వర్గంలోని ఇతర అక్షరాలతో యతి సాజాత్యాన్ని కలిగి ఉంటాయి.

సీ.
మనీయరాజశిఖామణి రిరాజర్వమహీధ్రనిర్ఘాతమునకు
తుర యశస్సిత చ్ఛత్త్రి కాయోధన యదాశ్వభంజళీ ఝుంపునకును
టంకితరాయకఠారిసాళువునకు డంభలాంఛన కోల  ఢాలునకును
త్త్వ పురాణకథా రసవేదికి దాన దయా ధర్మ ధామ మతికి
తే.
శుపతిప్రాప్త సామ్రాజ్యలున కబ్జ I బంధుబంధురతేజోవిభావసునకును
విశ్వవిభునకు సరి లేరు విశ్వజగతి I నిన నివి వర్గవళ్లకు చ్చు గృతుల. 37

0 comments

Jun 29, 2010

పాద ప్రధమాక్షర ము I త్పాదిత మగు వళి యనంగ

వళి ప్రాసములు
క.
పాద ప్రధమాక్షర ము I త్పాదిత మగు వళి యనంగ ; బ్రాసం బనఁగాఁ
బాద ద్వితీయవర్ణము I పాదచతుష్కమున కివియ ప్రాణము లెపుడున్.
29

పద్యపాదములోని మొట్టమొదటి అక్షరమును యతి అంటారు. ప్రాస అంటే పాదములోని ద్వితీయాక్షరము . పద్యం యొక్క నాలుగు పాదాలకూ యెప్పడూ యతి ప్రాస లనేవి ప్రాణం లాంటివి.
వళి భేదములు
క.
స్వరజలు వర్గజ లిత రే I తరవర్గజ లనఁగ నేకతరజ లనంగాఁ
బరపారు వళ్ళు నాలుగు ; I వరుసఁ దెనుంగునకు వాని వలయుం దెలియన్
. 30

స్వరజలు, వర్గజలు, ఇతరేతర వర్గజలు, ఏకతరజలు అని యతులు తెనుగులో వరుసగా నాలుగు విధాలుగా ఉంటాయి. వాటిని గుఱించి తెలిసికోవాలి. అంటున్నాడు పెద్దయ మహాకవి. కాని అనంతామాత్యుడు తన ఛందోదర్పణంలో యతులు ఐదు విధాలు అని వాటిని స్వర యతులు, వర్గయతులు, సరసయతులు, సంయుక్తయతులు, ప్రత్యేకయతులు అని విభాగం చేస్తాడు. అనంతుని సరసయతులు సంయుక్తయతులు రెండూ కలసి పెద్దయ గారి ఇతరేతరవర్గయతులు గా ఉంటాయన్నమాట.
క.
కోరి యకారము మొదలౌ I కారము తుద యైన యచ్చుగమి పండ్రెండున్
వారక యొండొంటికి నిం I పారఁగ వళ్ళయ్యె నాల్గు నైదును మూడున్. 31


అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ౠ, ఏ, ఐ, ఓ ఔ - ఈ పండ్రెండు అక్షరాలూ పరస్పరం ఈక్రిందివిధంగా యతి సామ్యం కలిగి ఉంటాయి.
అ, ఆ లకు ఐ, ఔ లు
ఇ, ఈ, ఋ,ౠ లకు ఏకారము
ఉ, ఊ లకు ఓకారము -- ఇవి స్వర యతులు. ఈ అచ్చులలో హ్రస్వాక్షరాన్ని చెపితే దీర్ఘాక్షరం కూడా దానిలో కలిసే ఉంటుంది. సంస్కృత భాషలోని సంధ్యాక్షరములలో హ్రస్వములు లేవు. అంటే ఎ ఒ లు లేవన్నమాట.

పై పద్యంలో నాల్గు నైదును మూడున్ అనేదాన్ని ఎలా అన్వయించుకోవాలో నాకు తెలియటం లేదు. పెద్దలెవరైనా వివరించగలరని నా ఆశ.
అజ్విరమము
క.
ఆ ఐ ఔ లత్వమునకు I నీ ఏలును ఋద్యయంబు నిత్వమునకుఁ దా
మూ ఓ లుత్వమునకు వళు I లాయచ్చుల దొరసి యుండ హల్లుల కెల్లన్
. 32

అ కారానికి ఆ, ఐ, ఔ లు
ఇ కారానికి ఈ, ఏ, ఋ, ౠ లు
ఉ కారానికి ఊ, ఓ లు యతులుగా అవుతాయి.
ఇవేకాకుండా ఈ అచ్చులతో కూడిన అన్ని హల్లులకూ కూడా ఇది వర్తిస్తుంది.
అకారవళి నిరూపణము
తే.
వని ధర్మజుఁబోలు నిత్యార్యచర్య,
నాదిరాజుల దొరయు నిత్త్యైంద్రభూతి
రులఁ బ్రహరించు బహుదండౌగ్ర్యమునను,
విధుకులాగ్రణి చాళుక్య విశ్వవిభుఁడు
. 33
ఇకారవళి నిరూపణము
ఆ.
నజుఁ డీగి, భారతీశుండు చతురత, I నేకవీరుఁ డాజి జుతయందు,
జరిపుఁడు సిరి, నహీనుండు భూవహ I మున విశ్వమనుజనాథవిభుఁడు
. 34
ఉకార వళి నిరూపణము
క.
ధరణీవరాహలాంఛితుఁ I డురరీకృత సకలవిద్యుఁ డూరీకృత సం
గరజముఁడు విశ్వభూవరుఁ I డురుకీర్తుల నెగడు నా బిడౌజో నిభుఁ డై. 35

0 comments

Jun 28, 2010

కమనీయంబగు గద్యపద్యమయమై కావ్యంబు

మ.
కమనీయంబగు గద్యపద్యమయమై కావ్యంబు ; గద్యంబు నా
నమరుం బాదనియంత్రణానియమవిన్యస్తప్రశాస్తార్థ మై
రమణీయాంఘ్రిచతుష్టయ స్ఫుట వళిప్రా సాభిరామంబు ప
ద్యము ; తత్పద్యము వృత్తజాతు లన రెండై పర్వుఁ గావ్యంబులన్. 25



కావ్యమనేది గద్య పద్యాలతో కూడుకున్నదై కమనీయంగా ఉంటుంది. గద్యానికి పాదనియమం అనేది ఉండకుండా సాగిపోతుంటుంది. కాని పద్యం మటుకు రమణీయమైన నాలుగు పాదాలతో కూడుకొని వళి ప్రాసలతో స్ఫుటమైన రీతిలో సాగుతుంది. ఆ పద్యములు మళ్ళీ రెండు రకాలు గా ఉంటాయి కావ్యములలో - వృత్తపద్యాలని, జాతి పద్యాలనిన్నీ.( జాతులలో జాతులు ఉపజాతులని రెండు వర్గాలు )

క.
వృత్తం బనఁ జతురంఘ్రి సు
వృత్తం బై వళుల వ్రాల వెలయును ; మాత్రా
యత్తగణంబులచేతఁ బ్ర
వృత్తాకృతిఁ బరఁగు జాతివితతులు కృతులన్.



వృత్తమనేది నాలుగు పాదాలతో కూడి మంచినడకతో యతిప్రాసలతో అలరారుతుంది. జాతి పద్యాలు మాత్రం మాత్రాగణాలతో నిర్దేశింపబడిన గణాలతో ప్రకాశిస్తుంటాయి.

తే.
విరతి విశ్రామ విశ్రాంతి విరమ విరమ
ణాభిదాన విరామము లనెడి పేళ్ళు
యతికిఁ బర్యాయపదము లై యమరుఁ గృతిని ;
యుక్తి పదములఁ గృతియందు నునుపవలయు. 27


నిరతి, విశ్రామము, విశ్రాంతి, విరమము, విరమణము అనే పేర్లు యతికి పర్యాయపదాలు. ఉపాయంతో ఏయే పద్యాలకు ఎక్కడెక్కడ యతిని
ఉంచాలో ఆయా ప్రదేశాలలో ఆ యా నిర్దేశిత అక్షరాలను కృతులందు యతి రూపంలో నిలుపవలసి ఉంటుంది.

క.
కరి గిరి పుర నిధి శశి ది I క్పరిసంఖ్యానంబు గణితపరిభాషలచే
నరసి యతి నిలుపుచోటులు I పరికింపఁగవలయుఁ గావ్యబంధన వెలయన్.
28


ఈ పద్యంలో యతుల సంఖ్య వివరింపబడింది. కరి - అష్టదిగ్గజాలు 8, గిరి - నవగిరులు 9, పుర , నిధి - నవనిధులు 9, శశి - , దిక్ - అష్టదిక్కులు 8, వీని సంఖ్యానమును గణితపరిభాషలచే అరసి యతి నిలుపుచోటులు ఎన్ని వస్తాయో లెక్కతేల్చాలి అని నా భావన.నాకు ఈ లెక్క తెలియరాలేదు. పెద్దలు తెలియపరిస్తే ముందుగా వారికి నా కృతజ్ఞతలు .

0 comments

గురువు లగు నొంటి సున్నల, నిరుసున్నల జమిలివ్రాల నెడమల నూఁదన్

క.
గురువు లగు నొంటి సున్నల,
నిరుసున్నల జమిలివ్రాల నెడమల నూఁదన్
బొరసినవియు దీర్ఘములు, ని
తరములు లఘువులు గణములు త త్త్రియతంబుల్.22


ఏవేవి గురువులు, ఏవేవి లఘువులు వాటి వివరాలను చెపుతున్నాడు. పూర్ణానుస్వారము, విసర్గ, ఒత్తులతో కూడిన అక్షరములు - ఈ మూడింటికి ఎడమ ప్రక్కనున్న అక్షరములు గురువులు. ఇవి కాక మిగిలినవి లఘువులు.

క.
ఇందుఁడు గాంతి, వపుఃప్రభఁ
గందర్పుఁడు, స ప్తస ప్తి ఘనరుచి ననఁ జె
న్నందినయవి గురువులు చె
న్నొందిన విడుపులును; నట్ల యున్నవి లఘువుల్. 23


పై పద్యంలో గురువులు ఏవో లఘువులు ఏవో విశదీకరిస్తున్నాడు చూడండి. ఇందుఁడు లో ఇ, గాంతి లో గా, వపుఃప్రభ లో పు , గందర్పుఁడు లో గ మరియు దలు, స ప్తస ప్తి లో రెండు సలు, జె న్నందినలో జె మరియు న్న, తరువాత చెన్నొందిన లో చె మరియు న్నొ, నట్ల లో న , యున్నవి లో యు - ఇవి గురువులు. మిగిలినవి లఘువులు.

క.
కృతికఌపులును తృపిదృపులును
పితృభృతులును నిలుచు పదముపిఱుఁదన లఘువుల్,
కృతిలో నగణములును దీ
ర్ఘత నొందినయేని రెట్టిఁ గా దగు నెఱుఁగన్.24

1 comments

Jun 26, 2010

గురు లఘువులు గలములు; లఘు గురులు గురులఘువులు నెన్ని కొన వ హము లగున్

క.
గురు లఘువులు గలములు; లఘు
గురులు గురులఘువులు నెన్ని కొన వ హము లగున్;
గురులఘువులు త్రితయము లై
మురిసిన నవి మగణ నగణములు నాఁ బరఁగున్ 19.


ఒక గురువు ఒక లఘువు కలసి UI గల ములు అవుతుంది. ఒక లఘువు ఒక గురువు IU వ గణము, ఒక గురువు ఒక లఘువు UI హ గణము అవుతుంది. మూడేసి గురువులు UUU మ గణముగాను, మూడేసి లఘువులు III న గణము గాను అవుతాయి.

ఆ.
మగణ రచన కాది మధ్యాంత లఘువులు
గలిగె నేని య ర త గణము లయ్యె
నగణ రచన మొదల నడుమను గడ గురు
వుండెనేని భ జ స లొప్పు మిగులు. 20


మగణమునకు UUU మొదటను, మధ్యను, చివరను ( గురువుకు బదులుగా ) లఘువు ఉంటే య ర త గణములు . IUU య గణము, UIU ర గణము, UUI త గణము ఏర్పడుతాయి. అదేవిధంగా న గణమునకు III మొదటను, మధ్యను, చివరను ( లఘువుకు బదులుగా ) గురువు గనక ఉంటే UII భ గణము, IUI జ గణము, IIU స గణము ఏర్పడుతాయి.

క.
లోవంక వ్రాయ గురు వగు;
నేవంకయు లేనివ్రాఁత యెసఁగును లఘువై
జైవాతృక రేఖాయుత
భావజశరనిభము లండ్రుఁ ప్రాజ్ఞులు మఱియున్. 21


లోపలి వైపు వంక వచ్చునట్లుగా వ్రాస్తే U అది గురువుకు చిహ్నం అవుతుంది. ఏ వంకా లేకుండా తిన్నని గీతలా వ్రాస్తే I అది లఘువుకు చిహ్నమవుతుంది. వీటిని రెండింటినీ మన్మధుని యొక్క విల్లనీ బాణమనీ ప్రాజ్ఞులు పేర్కొంటారు.

0 comments

ధీశ్రీస్త్రీ మన మగణము I విశ్రుత , మధిదైవతంబు విశ్వంభర

క.
ధీశ్రీస్త్రీ మన మగణము I విశ్రుత , మధిదైవతంబు విశ్వంభర ; ని
త్యశ్రీల నొసఁగు మగణ I ప్రశ్రయముఖకవిత చెప్పఁ బని దనుఁ దలపన్.
11

ధీశ్రీస్త్రీ అనగా మూడు గురువులు గలది. ఇది మగణము. దీనికి అధిదైవతము విశ్వంభర, అంటే భూదేవి. ఎప్పుడూ ధనాన్ని ఒసగుతుంది . మగణము తో ప్రారంభించి కావ్యాన్ని వ్రాయటం మొదలుపెడితే ధనప్రాప్తి .

క.
జగతి వరాహా యనగా I యగణం బుదయించె నుదక మధిదైవత మై,
యగణప్రయోగములయెడఁ I దగిలించున్ సిరులుఁ దన్నుఁ దలఁపున నిలుపన్.
12

వరాహా అనగా ఒక లఘువు రెండు గురువులు . ఇది యగణము. దీని కధిదైవతము నీరు. యగణ ప్రయోగము వలన సిరులు కలుగుతవి. దీనిని తలపులో ఉంచుకొని కావ్యారంభం చేస్తే సిరులు కలుగుతాయట.

తే.
బ్రమిసి కాగుహా రనునట్టి పలుకు రగణ
మయ్యె ; నధిదైవతము వహ్ని యయ్యెఁ గానఁ,
గవితముఖమున ర గణంబు గట్టునపుడు
వహ్నిఁ దలంపగఁ బగఱకు వచ్చుఁ జావు. .
13

కాగుహా రనునది ఒకగురువు ఒకలఘువు ఒకగురువు తో ఉంటుంది. ఇది ర గణము. దీనికి అధిదైవతము అగ్ని. అగ్నిని ధ్యానించి. ర గణాన్ని దృష్టిలో ఉంచుకొని కావ్యాన్ని ప్రారంభిస్తే కవి గారి శత్రువుకు చావు తప్పదన్నమాట.

క.
గతికై ఫణి వసుధా సని I మతిఁ దలఁచిన సగణ మయ్యె ; మారుత మధిదై
వత మండ్రు; సగణముఖ మగు I కృతి పగఱకు మగుడులేని కీ డొనరించున్
. 14

పింగళుడు వసుధా సని అంటే రెండు లఘువులు ఒక గురువు అన్నమాట . ఇది సగణ మోతుంది. దీనికి వాయువు అధిదైవతము. సగణ ముఖంగా కృతి చెపితే కవి గారి పగవారికి తిరుగులేని కీడును కలిగిస్తుందన్నమాట

క.
సాకేత్వ దనుడుఁ దగణము I జాతం బై శూన్య మగుడు, జద లధిదైవం
బై తనరె ; దగణముఖకృతి I శ్రీతుం డగు నృపుని నైన హీనుం జేయున్.
15

సాకేత్వ అంటే రెండు గురువులు ఒక లఘువు ఇది తగణమౌతుంది. దీనికి శూన్యాన్ని కలిగించటం లక్షణం. దీని కధిదైవతం ఆకాశము . తగణ ముఖం గా కృతి చెప్పినపుడు శ్రీమంతుడైన రాజు లాంటి వాడైనా సరే శత్రువు హీనుడుగా మారిపోతాడట.

ఆ.
తనరఁ బింగళుఁడు కదాస జనన్ జగ
ణము జనించెఁ, దదధినాథుఁ డినుఁడు;
తొలుతఁ గృతిని జెప్పఁ దొణఁగుచో నర్కునిఁ
దలఁప నరికి రోగతతులు వొడము.
16

పింగళుడు కదాస అని అనగా ఒక లఘువు ఒక గురువు ఒక లఘువు ఉంటాయి. ఇది జగణమౌతుంది. దీని కధినాథుడు సూర్యుడు. జగణం తో మొదలుపెట్టి కృతిని చెప్తే కవిగారి శత్రువుకు సకల రోగబాధలూ కలుగుతాయట.

క.
ఖగపతి కింవద భన నది
భగణం ; బుడురాజు తదధిపతి ; భగణాద్యం
బుగనుం గృతి చెప్పునపుడు
మృగాంకుఁ దలపంగ నగు సమీహిత కాంతుల్.
17

పింగళుడు కింవద అని అనగానే ఒక గురువు రెండు లఘువులు కలిగిన భగణం పుడుతుంది. దీనికి అధిదైవతం ఉడురాజు. భగణంతో కృతి చెప్పినపుడు చంద్రుని తలుచుకుంటే సమీహిత కాంతులు కలుగుతాయట.

క.
సహస నని పలుక నగణం
బహతం బగుఁ, దదధిదైవ మగుఁ బ్రాణుడు; త
ద్విహితస్మృతి నాయువు గడు
విహితం బగు నగణముఖ వినిర్మాణములన్
18

పింగళుడు సహస అని పలగ్గానే మూడు లఘువుల నగణం ఏర్పడుతుంది. దాని కధిదైవతం ప్రాణుడు. దీనితో కావ్యనిర్మాణం సాగిస్తే ఆయువు క్షీణిస్తుందట.

0 comments

Jun 25, 2010

పటుమతి నట మున్ను మహా I నటుఁ డీశుఁడు వాచకాభినయమునకై

క.
పటుమతి నట మున్ను మహా I నటుఁ డీశుఁడు వాచకాభినయమునకై యు

త్కటయతిలయమయతాళ I స్ఫుటవికటచ్ఛంద మందముగ నొనరించెన్. 6
మహా నటుడైన ఈశ్వరుడు పూర్వం వాచకాన్ని అభినయించే సందర్భంలో అధికమైన యతిలయ తాళములతో కూడిన స్ఫుటమైన వికటఛందాన్ని  అందముగా కూర్చినాడట.
క.







సృజియించి యిచ్చె నజునకు 
నజుఁడును భరతునకునిచ్చెనమ్మునివరుడున్
ఋజుమతి యగు పింగళుఁ డను
భుజగమునకు నిచ్చె భుజగభోజను డచటన్. 7

శివుడు ఛందశ్శాస్త్రాన్ని సృష్టిచేసి బ్రహ్మదేవునికి ఇచ్చాడట. బ్రహ్మ భరతు డనే మహామునికి, ఆ ముని పింగళుడనే నాగరాజుకు ఇచ్చాడట. అక్కడ ఉన్న గరుత్మంతుడు అప్పుడు,
క.
ప్రియ యిది యేటిది నావుడు
బుయిలోడిన పలుకు తుదల పొల్లుల చేతన్
మయరసతభజన గణము లు
దయమొందెన్, ఛంద మొందె దద్గణయుక్తిన్.8

ప్రియ యిది యేమిటి అని అడుగగా సంకోచముతో పలికిన పలుకుల చివరన గల పొల్లక్షరముల వలన మ, య, ర, స, త భ , జ , న గణములు పుట్టినవి. ఆ గణములతో ఛందస్సు ఏర్పడినది.
క.








గురువును లఘువును శంకర
గిరిజాకృతులు తత్ప్రకృతములు గణముల్
గరుడినిపై పింగళఫణి
విరచించిన తెఱఁగు వరుస వివరింతుఁ దగన్. 9
గురువు శంకరుడు, లఘువు పార్వతీ దేవి ఆకృతులనుండి ఉద్భవించాయి. వాటినుండి ఏర్పడిన గణములతో కూడిన ఛందాన్ని గరుడినిపై పింగళఫణి విరచించిన విధంగా వరుసగా తెలియపరుస్తాను, అంటున్నాడు.
వ.
అవి యెయ్యవి యనిన --- ధీశ్రీస్త్రిమ్, వరాహాయ్, కాగుహార్, వసుధాస్, సాతేక్వత్, కదాసజ్, కింవదభ్, సహసన్: ఇట్లని గరుడ భయంబుననుం దిర్యగుదితస్వభావంబునను సాభిప్రాయజ్ఞేయనేయార్థంబుగా గణస్వరూపనిరూపణంబు నకునై పింగళనాగంబుచేత నుచ్ఛరితంబు లగు తద్వాక్యాంతరంబులం బొల్లులై తోఁచు మకార - యకార - రేఫ - సకార - తకార - జకార - భకార - నకారంబులు గణాభిదానంబులకు నాద్యక్షరంబు లగుటచేత మగణ - యగణ - రగణ - సగణ - తగణ - జగణ - భగణ - నగణంబులు గ్రమంబునం బ్రస్తారోద్ధారంబునం బ్రభవించెఁ, దత్స్వరూపంబులునుం దదధిదైవతంబులం బరిపాటిం బ్రకటింతు నెట్లనిన 11
అవి
ధీశ్రీస్త్రీ   U U U    మ  గణము
వరాహా  I U U    య గణము
కాగుహా U I U    ర గణము
వసుధా  I I U    స గణము
సాతేక్వ U U I    త గణము
కదాస   I U I    జ గణము
కింవద  U I I    భ గణము
సహస  I I I     న గణము  లు. ఇవి గరుడని వలని భయంబు చేత గాని తిర్యగ్జాతుల స్వభావం నుండి సహజంగా పుట్టే ధ్వనులుగా పింగళ నాగము నుండి వెలువడిన ధ్వనులు గణాలుగా రూపాంతరం చెందినవి. ఆ వాక్యాంతము లందుండే హల్లక్షరాలే వాటికి నామాక్షరములు గా ఏర్పడినవి. వాటి వివరములను వాటి వాటి అధిదైవతములను క్రమంగా తెలియ పరుస్తాను, అంటాడు..

0 comments

Jun 24, 2010

ధీయుత పింగళనాగ హIలాయుధ జయదేవ ముఖ్యు లగు నార్యులచే

కావ్యాలంకార చూడామణి -- సప్తమోల్లాసము -- ఛందః ప్రకరణము
క.
శ్రీ విశ్వేశ్వరునకునై I భావిత విశ్వేశ్వరాంఘ్రిపద్మునకై సం
భావిత పద వాక్య కళాI కోవిదునకై నయగుణ విశేష గుణ నిధునకునై. 1

విన్నకోట పెద్దయ మహాకవి ఎలమంచిలి పంచధారల ప్రాంత దేశపాలకుడైన చాళుక్య రాజు విశ్వేశ్వర భూపతికి ఆశ్రితుడు. ఈ విశ్వేశ్వర భూపతి రాజ రాజ నరేంద్రుని వంశములోని వాడు. కవి తన కావ్యాలంకార చూడామణిని తన ప్రభువుకు అంకితమిస్తూ ప్రతాపరుద్రీయములో వలెనే అన్నిటికిని ప్రభువునే విషయముగాఁ జేసి లక్ష్యములను వ్రాసినాడు. ఈ ఛందో ప్రకరణాన్ని కూడా తన ప్రభువు కొఱకే నని పైన చెప్తున్నాడు.
క.
ధీయుత పింగళనాగ హIలాయుధ జయదేవ ముఖ్యు లగు నార్యులచే
నాయతమై యామ్నాయ పI దాయిత మగు ఛంద మొప్పిదముగ నొనర్తున్. 2

పింగళు డనబడే  నాగము, హలాయుధుడు, జయదేవుడు మొదలైన ఆర్యులచే వేదములనుండి విస్తారముగా ఉద్ధరింపబడిన ఛందశ్శాస్త్రమును ఒప్పిదముగా చెబుతానంటున్నాడు.
క.
ఛందో విభ్రమ విధితోఁ I బొంది కదా వేదశాస్త్రములు వాగ్వనితా
మందిరము లైన యయ్యరI వింద భవుని వదనములకు విభవం బొసగెన్. 3

ఛందశ్శాస్త్ర విభ్రమ విభవాన్ని పొందటం వల్లనే కదా  వేదశాస్త్రములకు  ఆ అరవింద భవుడైన బ్రహ్మ దేవుని నాలుగు వదనములకు వాక్కు అనబడే సరస్వతీ దేవి మందిరములg అనబడే వైభవం కలిగింది !
శా.
పొందై , గౌరవలాఘవప్రకృత మై , పూర్ణాక్షర స్నిగ్ధ మై,
యందం బై , శ్రుతిసమ్మతప్రకట మై , ప్రాపించు నానా విధ
చ్ఛందస్సూత్రము లేక లోకములఁ జంచద్వాక్య రత్నావళీ
సందోహంబులు కంఠభూషణము లై సంధిల్లునే ఏరికిన్ ? 4

పొందు కలిగిన దై, తేలికగా గౌరవాన్ని పొందిన దై, పూర్ణాక్షరములతో స్నిగ్ధమైన సౌందర్యం కలిగి అందమైన దై, వేదములచే సమ్మతింపబడి ప్రకటితమైన దై ప్రాపించే నానా విధములైన ఛందస్సూత్రములు ఒకే లోకములో కదలుచున్న వాక్యములనబడే రత్నాలతో కూడిన సమూహములు ఎవరికైనా కంఠభూషణములుగా ఉంటాయా ?
క.
ఛందము వాఙ్మయ విద్యాI కందము యతిగమక సమకగణవృత్తకృతా
నంద మమందార్థకళాI విందము వాణీకరారవిందము ప్రతిభన్.5

ఛందస్సు విద్యకు అందాన్ని చేకూరుస్తుంది. ప్రతిభలో యతి గమకములతో కూడినదై వృత్తములతో చేయబడిన గొప్ప అర్థాలు కలిగిన కళావిందము , సరస్వతీ  దేవి చేతికి అరవిందమై ఒప్పుతుంది.

తరువాత ఈ ఛందశ్సాస్త్ర మెలా ఉత్పన్నమైనదో చెపుతాడు.

4 comments

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks